- యువకులకు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పిలుపు
- జి.హెచ్.ఎం.సి కార్పొరేటర్స్ స్పోర్ట్స్ మీట్ 2023 షటిల్ బ్యాడ్మింటన్ లో విజేతలకు బహుమతులు ప్రదానం
- పురుషుల విభాగంలో జగదీశ్వర్ గౌడ్, మహిళా విభాగంలో బొంతు శ్రీదేవికి మొదటిస్థానం

నమస్తే శేరిలింగంపల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు మంచి ప్రాధాన్యత కల్పిస్తుందని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని పీజేఆర్ స్టేడియంలో జి.హెచ్.ఎం.సి కార్పొరేటర్స్ స్పోర్ట్స్ మీట్ 2023 షటిల్ బ్యాడ్మింటన్ పురుషుల విభాగంలో కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, మహిళ విభాగంలో కార్పొరేటర్ బొంతు శ్రీదేవి మొదటి స్థానంలో నిలిచారు. ఈ సందర్భగంగా వీరికి జోనల్ కమిషనర్ శంకరయ్య, డీసీలు వెంకన్న, సుధాంష్, కార్పొరేటర్లు మంజుల రఘునాథ్ రెడ్డి, హేమ శ్యామల, దేవేందర్, ప్రభు దాస్, ఎఎంఓహెచ్ కార్తిక్ తో కలిసి బహుమతులు ప్రధానం చేశారు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ప్రతిఒక్కరు జీవితంలో విద్యతో పాటు క్రీడల్లో రాణించి మంచి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. స్పోర్ట్స్ మీట్ ను నిర్వహించడం చాలా అభినందించదగ్గ విషయమని, విజేతలుగా నిలిచినవారిని మనస్ఫూర్తిగా అభినదిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, ఎస్.సి సెల్ అధ్యక్షుడు రఘునాథ్ బీఆర్ ఎస్ నాయకులు జనార్దన్ రెడ్డి, వరలక్ష్మి, మాధవి పాల్గొన్నారు.