నేతాజీనగర్ కాలనీలో సమస్యలు పరిష్కరించండి

  • కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి కి వినతిపత్రం సమర్పించిన భేరీ రామచందర్ యాదవ్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి : కాలనీలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, వెంటనే పరిష్కరించాలని కోరుతూ శేరిలింగంపల్లి గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డిని కలిసి నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీ అధ్యక్షుడు భేరీ రామచందర్ యాదవ్ వినతి పత్రం అందించారు. కాలనీలోని మౌలిక వసతులు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యలు, ఓపెన్ నాళాలు మరమ్మతులు, సీసీ రోడ్లు వేయించాలని, మౌలిక వసతులు త్వరగా కల్పించాలని కోరారు. దీనికి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ నేతాజీ నగర్ కాలనీలో ఉన్న సమస్యలన్నిటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అసోసియేషన్ తరఫున అసోసియే సభ్యులు శివా యాదవ్ ధన్యవాదాలు తెలిపారు.

కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి కి వినతిపత్రం సమర్పిస్తున్న భేరీ రామచందర్ యాదవ్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here