లక్ష్యం గొప్పదైతే..అసాధ్యమేమీ లేదు

  • శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం
  • శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వి.జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పని చేయాలని, గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వి.జగదీశ్వర్ గౌడ్. మియాపూర్ సితార గ్రాండ్ హోటల్ లో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..

హైదరాబాద్ పొలిమేర దాటలేను.. ఎవరికి నయాపైస ఇవ్వలేను.. రేవంత్ రెడ్డి సమక్షంలో కండువా కప్పుకుందాం అని 10 మందికి చెబితే 1000 మంది వచ్చారని తెలిపారు. గత 15 ఏళ్లలో తన అనుచరులు ఎక్కడా అవినీతికి పాల్పడలేదని, తన కార్యకర్తలు, అభిమానులే తన బలమని చెప్పారు. సందర్బాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలనుకున్న. 2028లో అడుగు వేద్దాం అనుకున్నా కాని ఇప్పుడు తప్పట్లేదు..లక్ష్యం గొప్పదైతే అసాధ్యం అనేదే లేదని, ప్రజలు మార్పు కోరుతున్నారు.

డబ్బులు ఇస్తే తీసుకోండి. కానీ కాంగ్రెస్ వైపు నిలవండి అని చెప్పారు. ఈ సమావేశంలో టీపీసీసీ శేరిలింగంపల్లి కో ఆర్డినేటర్ వినయ్ రెడ్డి, రఘునందన్ రెడ్డి, మహిపల్ యాదవ్, హమీద్ మియా, డివిజన్ అధ్యక్షులు, యువజన కాంగ్రెస్, మహిళ కాంగ్రెస్, మైనారిటీ కాంగ్రెస్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here