వేడుకగా అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం

  • హాజరై పూజలు చేసిన మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
  • పాల్గొన్న కార్పొరేటర్లు

నమస్తే శేరిలింగంపల్లి : భారతి నగర్ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆమె స్వగృహం లో అయ్యప్ప స్వామి మహా పడి పూజ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగ రెడ్డి, బొల్లారం మున్సిపల్ ఛైర్మన్ కొలన్ రోజా బాల్ రెడ్డి, కార్పొరేటర్లు పుష్పనాగేష్ యాదవ్, మెట్టు కుమార్ యాదవ్, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, అయ్యప్ప స్వాములు భక్తులతో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి స్వగృహం లో అయ్యప్ప స్వామి మహా పడి పూజ మహోత్సవంలో పాల్గొన్న మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్లు

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, ఆదర్శ్ రెడ్డి, చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కుమార్ గౌడ్, పాటి సత్యనారాయణ, దేవేంద్ర, సత్యనరాయణ, రాకేష్, సంపత్ చారీ, జ్యోతి, శేఖర్, నరేందర్ పాల్గొన్నారు.

కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి నివాసం వద్ద..
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here