బస్తీల అభివృద్ధికి కృషి చేస్తాం : శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి : ప్రజా పాలనకు నిదర్శనంగా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనను సాగిస్తుందని శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రతి బస్తీలో పర్యటించి సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు అన్ని విధాలుగా అందేలా చూస్తామని చెప్పారు.

అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పీజేఆర్ నగర్ బస్తీలో ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్

అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పీజేఆర్ నగర్ బస్తీలో ఇంటింటికి పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుని అనంతరం మాట్లాడారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఒక్కోటిగా పరిష్కారం చూపే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

పీజేఆర్ నగర్ నగర్ లో ప్రజలతో జగదీశ్వర్ గౌడ్

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ భాను ప్రసాద్, నాయకులు సాంబశివరావు, డివిజన్ నాయకులు గోపాల్, ప్రభాకర్, లింగం, రవి, శశిధర్, నాగయ్య గౌడ్, కరుణాకర్ గౌడ్, నరేష్ గౌడ్, అజయ్ కుమార్, కరుణాకర్ రెడ్డి, పండు, వాసు, సతీష్ గౌడ్, మల్లన్న,చారి, శివ, నారాయణ, వెంకన్న, ఆంజనేయులు, ప్రవీణ్, మహిళలు నాగమణి, శ్రావణి పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here