విద్యార్థులకు షూస్ పంపిణీ

నమస్తే శేరిలింగంపల్లి: యాదాద్రి జిల్లా ఆత్మకూర్ మండలం పల్లెర్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులందరికీ హైదరాబాద్ కి చెందిన దాత దొంతి లక్ష్మీనారాయణ గౌడ్ విరాళంగా షూస్ పంపిణీ చేశారు. ఈ సందర్బంగా లక్ష్మీనారాయణ గౌడ్ మాట్లాడుతూ క్రమశిక్షణతో కష్టపడి చదివి ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆకాంక్షించారు.

విద్యార్థులకు షూస్ పంపిణీ చేసిన దాత దొంతి లక్ష్మీనారాయణ

గౌడకంఠమ్ ఎడిటర్ నోముల సిద్దూ గౌడ్ ఈ విషయాన్నీ తన దృష్టికి తీసుకొస్తే స్పందించి ఈ గ్రామానికి వచ్చి అందజేశామని చెప్పారు. అనంతరం గౌడకంఠమ్ ఎడిటర్ నోముల సిద్దూ గౌడ్ మాట్లాడుతూ విద్యాలయం తనకు దేవాలయమన్నారు. అందుకే తాను చదివిన స్కూల్ కి గతంలో ఇన్వెర్టర్, మైక్ సెట్ ఇప్పించనున్నారు. తన ఆత్మీయులు లక్ష్మీ నారాయణ గౌడ్ సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. స్కూల్ అభివృద్ధికి మరింత సహకారం అందిస్తానని చెప్పారు. దాతలు అందించే సహకారానికి ప్రధానోపాధ్యాయులు స్వామి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు అశోక్ గౌడ్, జనార్దన్ రెడ్డి, కరుణాకర్, రాంచందర్, ఉపాధ్యాయులు వెంకటనరసయ్య, భాస్కర్ రెడ్డి, షమీమ్, ఖలీమ్, లక్ష్మణ్, రవీందర్, విజయ, పల్లెర్ల కు చెందిన దేవేంద్ర చారీ పాల్గొన్నారు.

షూస్ పొందిన ఆనందంలో విద్యార్థులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here