సమస్యలుంటే తెలపండి.. పరిష్కరిస్తా : రాగం నాగేందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ లోని పాపిరెడ్డి కాలనీలో వడ్డెర సంఘం కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ని మర్యాదపూర్వకంగా ఆహ్వానించి సత్కరించారు. జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు తెలిపారు.

కార్పొరేటర్ నాగేందర్ యాదవ్ ను సన్మానించిన వడ్డెర సంఘం

అనంతరం కాలనీలోని ప్రజలు రోడ్లు, యూజిడి, ఎలక్ట్రికల్ పోల్స్ సమస్యల గురించి కార్పొరేటర్ కి విన్నపించారు. కార్పొరేటర్ స్పందించి తక్షణమే తగు చర్యలు తీసుకుంటానని, కాలనీలో ఏ సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని, ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. పాపిరెడ్డి కాలనీలోని వడ్డెర సంఘం రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం అభివృద్ధి కోసం విధాలుగా కృషి చేస్తూ సహాయపడతానని అన్నారు. ఈ కార్యక్రమంలో పల్లపు యాదయ్య, ఇరగదీల్ల నర్సింహులు, వరికుప్పల కృష్ణ, గోపినగర్ బస్తీ అధ్యక్షులు గోపాల్ యాదవ్, బోదాసు ఎల్లయ్య, పరశురాములు, మల్లేష్, నర్సింహులు, రవి, బాబు, భిక్షపతి, రాజు, వడ్డెర సంఘం సభ్యులు పాల్గొన్నారు.

ప్రజలకు నమస్కరిస్తున్న రాగం నాగేందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here