సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ కాలనీలో రూ. 1 కోటి 10 లక్షల అంచనావ్యయంతో చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ మియాపూర్ డివిజన్ అభివృద్ధిలో భాగంగా సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశామని, వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను పునరుద్ధరించడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని తెలిపారు. సీసీ రోడ్ల వంటి అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు బీ ఎస్ ఎన్ కిరణ్ యాదవ్, చంద్రిక ప్రసాద్ గౌడ్, అశోక్, తిమ్మరాజు, వరలక్ష్మి, స్వరూప, లావణ్య, బాలింగ్ లక్ష్మయ్య, శంకర్, శ్రీశైలం, గిరి, రాజేష్, అశోక్ కార్యకర్తలు, మహిళ నాయకులు, తెరాస పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

న్యూ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here