ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలను నాటుదాం

నమస్తే శేరిలింగంపల్లి: ఆంగ్ల సంవత్సరం 2023 పురస్కరించుకొని సైబర్ సిటీ సర్కిల్ ప్రెసిడెంట్, 327 ఐ ఎన్ టి యు సి, కే. వెంకటేశ్వర్లు దంపతులు శిల్పా ఎంక్లేవ్ పార్కులో శివుడు, వినాయకుడు ఆస్వాదించే పవిత్రమైన బిల్వ పత్రి మొక్క, లక్ష్మీ గణపతి దేవాలయం ప్రాంగణంలో కొబ్బరి మొక్కను నాటారు. ప్రతి పూజకు కొబ్బరికాయ కొట్టడం ఎంతో అవసరమని, ఈ నేపథ్యంలో కొబ్బరికాయ మొక్క నాటినట్లు చెప్పారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలను నాటుదామని పిలుపునిచ్చారు. ప్రతీ ఒక్కరికి ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

శిల్పా ఎంక్లేవ్ పార్కులో మొక్కలు నాటుతున్న సైబర్ సిటీ సర్కిల్ ప్రెసిడెంట్ కే. వెంకటేశ్వర్లు దంపతులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here