నమస్తే శేరిలింగంపల్లి: శిల్పారామం మాదాపూర్ లో సంక్రాంతి సంబురాలు ముగిశాయి. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసులు పాటలు, బుడబుక్కల, జంగమదేవరులు, పిట్టలదొర, ఎరుకలసానిల మాటల గారడీలు ఎన్నో సందర్శకులను అలరించాయి. భారతనాట్యాలాయ గురు చిత్ర నారాయణ శిష్య బృందం భరతనాట్య ప్రదర్శన అలరించింది.
![](https://namastheslp.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-17-at-5.44.53-PM.jpeg)
స్వరాంజలి, గణేశా పంచరత్న, శ్లోకాలు, అమ్మ వర్ణం, ఆలోకయే , శ్రీమన్నారాయణ తిరుప్పావై, ముద్దుగారేయ్ యశోద, తిల్లాన అంశాలను లక్ష్మి శరణ్య, ఆశ్రిత, ఆర్ని, సుమేధ, శ్రియ, విష్ణు ప్రియా, సంజన, హన్సిక, వర్షిణి మొదలైన వారు ప్రదర్శించి మెప్పించారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-17-at-5.45.02-PM-1.jpeg)