- అలరించిన “శ్రీ గోదా కళ్యాణం” నృత్యరూపకం
నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ లోని శిల్పారామం సంక్రాంతి పండుగ పురస్కరించుకొని సందర్శకులతో కిటకిటలాడింది. గంగిరెద్దులు, బుడబుక్కల, జంగమదేవరులు, హరిదాసులు, పిట్టల దొర, ఎరుకల సాని వేషాలు, ఆటలు, గారడీ మాటలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
![](https://namastheslp.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-16-at-9.26.42-AM.jpeg)
![](https://namastheslp.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-16-at-9.27.05-AM.jpeg)
సంక్రాంతి పండుగ రోజు చంద్ర శేఖర్ శిష్య బృందం చే “శ్రీ గోదా కళ్యాణం” కూచిపూడి నృత్య రూపకం ఎంతగానో ఆకట్టుకున్నది. కనుమ పండుగ పురస్కరించుకొని కర్ణాటక రాష్ట్రం తుంకూర్ ప్రాంతం నుంచి ప్రముఖ భరతనాట్య గురువర్యులు డాక్టర్ సాగర్ శిష్య బృందం ప్రదర్శించిన భరతనాట్య అంశాలు ఎంతగానో అలరించాయి. ప్రముఖ నర్తకీమణి కుమారి నేహా సింగ్ శిష్య బృందం ప్రదర్శించిన జానపద, ఫ్యూషన్, ఇండియన్ కాంటెంపరరీ నృత్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి.
![](https://namastheslp.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-16-at-9.26.54-AM.jpeg)