నమస్తే శేరిలింగంపల్లి : శిల్పారామం మాదాపూర్ లో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా కర్ణాటక గాత్ర కచేరి, భరతనాట్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. సుసర్ల షణ్ముఖ ప్రియా తన గాత్ర కచేరిలో నిను కోరి, వర వల్లభ, యెన్నటికో, హిరణ్మయీమ్, వేంకటగిరి, ముక్తి ద్వారపు మొదలైన సంకీర్తనలని ఆలపించారు. వీరికి మృదంగంపై చంద్రకాంత్, వయోలిన్ పై ఫణి బాల సహకరించారు. బెంగళూరు నుండి విచ్చేసిన భరతనాట్య కళాకారిణి నిహారిక గౌడ ప్రదర్శన ఆధ్యంతం అలరించింది. సరస్వతి కృతి, జయదేవ అష్టపది, దేవర్ణమా, తిల్లాన అంశాలను ప్రదర్శించి మెప్పించారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2022/11/IMG-20221106-WA0021-1.jpg)
![](https://namastheslp.com/wp-content/uploads/2022/11/IMG-20221106-WA0022-1.jpg)