నమస్తే శేరిలింగంపల్లి: శిల్పారామం మాదాపూర్ లో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా భక్తి సంగీతం, కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. ఉదయశ్రీ, సంగీతలు ఆలపించిన అన్నమయ్య సంకీర్తనలు, భక్తి పాటలు ఎంతగానో అలరించాయి. అనూష శ్రీనివాస్ శిష్య బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యంలో గజవదాన బెదువే, పుష్పాంజలి, కులుకాగా నడవరో, దశావతారం, కృష్ణ శబ్దం, తిల్లాన అంశాలను సుమతి, శ్రీనివాస్, భావన, సంజిత, మానస, శాన్వి, ప్రణతి, అవని, కీర్తి మొదలైన వారు ప్రదర్శించి మెప్పించారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-10-at-5.21.23-AM.jpeg)
![](https://namastheslp.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-10-at-5.21.23-AM-1.jpeg)
![](https://namastheslp.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-10-at-5.21.24-AM.jpeg)