పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలి: రాయదుర్గం సిఐ మహేష్

నమస్తే శేరిలింగంపల్లి: రంజాన్ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని రాయదుర్గం ఎస్ఎచ్ఓ ఎం మహేష్ అన్నారు. రాబోయే రంజాన్ పండుగను దృష్టిలో ఉంచుకుని రాయదుర్గం పీఎస్ పరిధిలోని వివిధ కాలనీల అసోసియేషన్ సభ్యులు, మజీద్ కమిటీ వ్యక్తులు, శాంతి కమిటీ సభ్యులు, కమ్యూనిటీ నాయకులతో రాయదుర్గం పోలీసులు సమావేశం నిర్వహించారు. అన్ని మతాల స్థానిక సంఘాల నాయకుల సహాయంతో పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని, అలాగే ఎలాంటి సున్నితమైన సమస్యలు తలెత్తినా వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు, రాయదుర్గంకు ఎస్‌హెచ్‌ఓ సమాచారం అందించి శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో పంచవటి కాలనీ కార్యదర్శి విద్యాసాగర్‌రెడ్డి, విజయ్‌, దర్గా మజీద్‌ సభ్యుడు పాషా, ప్రశాంతి హిల్స్‌ రహమానుల్లాఖాన్‌, అంజయ్యనగర్‌ శివాలయం పూజారి శాస్త్రి, ఎస్ఐలు నాగరాజు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here