విద్యా, వైద్య రంగాల అభివృదే లక్ష్యం : కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి : ప్రభుత్వ పాఠశాలలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. గంగారాం బిఆర్ఎస్ గ్రామ కమిటీ, పాఠశాల అధ్యాపకుల విజ్ఞప్తి మేరకు శ్రీ కృష్ణ యూత్ ఆధ్వర్యంలో విద్యార్థులందరికీ ప్లేటు, కుర్చీలు పంపిణీ చేసిన అనంతరం చిన్నారులతో ముచ్చటించారు శ్రీ కృష్ణ యూత్ వ్యవస్థాపకుడు, మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్.

చిన్నారులకు ప్లేట్లు పంపిణీ చేస్తున్న కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్

ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు సంక్షేమాన్ని చూస్తూ మరోవైపు పేద వర్గాల అభివృద్ధిని కాంక్షిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో వార్డ్ సభ్యులు శేఖర్ ముదిరాజ్, రవి కుమార్, రాజేందర్, చిన్న, గోపి, వేరేందర్, హఫీజ్ పెట్ ఎస్.సి సెల్ అధ్యక్షులు కంది జ్ఞానేశ్వర్, మైనారిటీ నాయకులు ఇస్మాయిల్ ఖాన్, సీనియర్ నాయకులు యదన్న, యూత్ సభ్యులు శివ, అనిల్ పాల్గొన్నారు.

ప్లేట్లు పొందిన చిన్నారి విద్యార్థులతో కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, వార్డు సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here