సంక్షేమ పథకాల అమలులో దేశానికే ఆదర్శం తెలంగాణ

  • కల్యాణలక్ష్మి, షాదీముభారక్ కింద 100 మంది లబ్ధిదారులకు రూ. 1ఒక కోటి 11 వేల 600లు మంజూరు 
  • చెక్కుల రూపేణా అందజేసిన ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ని కొండాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మాదాపూర్, మియాపూర్, హఫీజ్పెట్, చందానగర్, భారతి నగర్ నగర్ పరిధిలోని పలువురికి కల్యాణ లక్ష్మి /షాదిముబారక్ పథకం కింద 100 మంది లబ్ధిదారులకు 1ఒక కోటి 11 వేల 600లు మంజూరయ్యాయి. ఈ ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపేణా మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, పూజిత జగదీశ్వర్ గౌడ్, మంజుల రఘునాథ్ రెడ్డి మాజీ కార్పొరేటర్ సాయి బాబాతో కలిసి లబ్దిదారులకు అందచేశారు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురికి కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పథకం కింద చెక్కులను ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ సంక్షేమ ప్రభుత్వంగా పేరుగాంచిందని, సంక్షేమ పథకాలకు ఏ లోటూ రాకుండా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ పేదలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందన్నారు. పథకాల అమలులో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందంటే సీఎం కేసీఆర్ పనితీరుకు నిదర్శనం అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో RI శ్రీనివాస్ , RI శ్రీకాంత్ మాజీ కౌన్సిలర్లు మోహన్ గౌడ్, విరేశం గౌడ్, లక్ష్మీనారాయణ గౌడ్, మాజీ కార్పొరేటర్లు అశోక్ గౌడ్ , రవీందర్ ముదిరాజు చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షులు మారబోయిన రాజు యాదవ్, కొండాపూర్ డివిజన్ అధ్యక్షులు కృష్ణ గౌడ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ , హఫీజ్పెట్ డివిజన్ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్, మియాపూర్ డివిజన్ అధ్యక్షులు BSN కిరణ్ యాదవ్ మియాపూర్ డివిజన్ అధ్యక్షులు గంగాధర్ రావు తెరాస నాయకులు ఉట్ల కృష్ణ, అబీబ్, కరుణాకర్ గౌడ్, జంగం గౌడ్, సత్యనారాయణ, చింతకింది రవీందర్, గుమ్మడి శ్రీనివాస్ , రాంచందర్, వెంకటేష్ గౌడ్, తిరుపతి యాదవ్ , శ్రీనివాస్ గౌడ్, జనార్దన్, సురేష్ నాయక్, నరేష్, చంద్రిక ప్రసాద్ గౌడ్, వరలక్ష్మి తెరాస నాయకులు , కార్యకర్తలు, పాల్గొన్నారు.

మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కార్పొరేటర్లతో కలిసి లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముభారక్ చెక్కులను అందజేస్తున్న ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ
చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న లబ్ధిదారులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here