శ్రీరామనవమి వేడుకల్లో ఆకట్టుకున్న సంగీత, నృత్య ప్రదర్శన

నమస్తే శేరిలింగంపల్లి: నల్లగండ్లలోని శ్రీ భ్రమరాంభ మల్లికార్జున స్వామి దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంగీత నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. తరిగొప్పుల శ్రీధర్, శ్వేత శిష్య బృందం కూచిపూడి నృత్య రూపకం, కర్ణాటక సంగీతంతో అదరగొట్టారు. ఈ కార్యక్రమంలో కళాకారిణీలు తరిగొప్పుల సంధ్యారాణి, మనస్విని, ఇందు, జయ హరిణి, లాస్య ఆరాధ్య, ప్రణవ స్పందన తదితరులు పాల్గొన్నారు.

కూచిపూడి నృత్య ప్రదర్శన చేస్తున్న తరిగొప్పుల శ్రీధర్, స్వేత శిష్యబృదం
కర్ణాటక సంగీతంతో ఆకట్టుకుంటున్న సంధ్యారాణీ, ప్రణవ స్పందన తదితరులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here