సేఫ్టీ పరికరాలు అందజేత

నమస్తే శేరిలింగంపల్లి: ప్రతి కార్మికుడు సేఫ్టీ పరికరం లేకుండా విద్యుత్తు పరికరాలను ముట్టకూడదని సైబర్ సిటీ సర్కిల్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కే వెంకటేశ్వర్లు అన్నారు. మాతృమూర్తి దినోత్సవం, హనుమాన్ జయంతి రోజున తన పుట్టినరోజు రావడం అదృష్టమన్నారు.

కార్మికులకు సేఫ్టీ పరికరాలు అందజేస్తున్న సైబర్ సిటీ సర్కిల్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కే వెంకటేశ్వర్లు

33/11 కెవి లోధా సబ్ స్టేషన్ ఆవరణలో పునాసమామిడి మొక్క, గౌతమి నగర్ చందానగర్ కమ్యూనిటీ హాల్ ప్రాంగణంలో పునాసమామిడి పునాస జామ మొక్క నాటారు. ఈ సందర్భంగా బాలాజీ నగర్, కె.పి.హెచ్.బి, మియాపూర్ ఫీజ్ ఆఫ్ కాల్ కార్మికులకు మొబైల్ ఎర్త్ రాడ్ మొబైల్ ఏ బి స్విచ్ హ్యాండిల్ అందజేశారు. ప్రతి కార్మికుడు భద్రతా సూత్రాలను పాటిస్తూ ఇష్టంతో కష్టపడి సేఫ్టీ పరికరాలను ఉపయోగిస్తారని, మనపై ఆధారపడి ఉన్న కుటుంబాలు అనాధలు కాకుండా ప్రతి ఒక్కరూ సేఫ్టీగా పనిచేసే సంస్థ అభివృద్ధి పథంలో తీసుకపోవుటకు కృషి చేయాలని కోరారు.

మొక్క నాటుతూ..
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here