రాయల్ ఫుడ్ హబ్ ప్రారంభం

  • పూజలు చేసి ప్రారంభించిన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ లోని పోలీస్ కాలనీలో నూతనంగా ఏర్పాటుచేసిన రాయల్ ఫుడ్ హబ్ ను శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ స్వయం ఉపాధి మార్గం ఎంచుకొని ముందుకు సాగడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులైన జీత్ యాదవ్, రాకేష్ యాదవ్ ను కార్పొరేటర్ అభినందించారు. రాయల్ ఫుడ్ హబ్ ను ఏర్పాటు చేయడంతో స్థానికులకు అందుబాటులోకి రావడం ఈ ప్రాంత వాసులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. మార్కెట్ లో ఉన్న పోటీని తట్టుకుని మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. కస్టమర్లకు మంచి సేవలు అందిస్తూ వారి మన్ననలు పొందాలని నిర్వాహకులకు తెలిపారు. కార్యక్రమంలో మహేంద్ర శర్మ, ఆశిష్, దినేష్, వికాస్, సంజయ్, పింటు, రాజు పాల్గొన్నారు.

పోలీస్ కాలనీలో నూతనంగా ఏర్పాటుచేసిన రాయల్ ఫుడ్ హబ్ ను ప్రారంభిస్తున్న శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here