మౌలిక వసతుల కల్పనే ధ్యేయం: ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: ప్రతి కాలనీ లో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని తారనగర్, టీఎస్ హెచ్ బి కాలనీలలో రూ.95 లక్షల అంచనావ్యయంతో చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణ పనులకు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, శేరిలింగంపల్లి నియోకజకర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన ,అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదితానని పేర్కొన్నారు.

కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి రోడ్ల పనులకు శంకుస్థాపన చేస్తున్న ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ

సీసీ రోడ్ల అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ విరేశం గౌడ్ బీఆర్ ఎస్ పార్టీ నాయకులు మల్లికార్జున శర్మ, అబీబ్ బాయ్, కవిత, గోపాలకృష్ణ నటరాజ్, యదా గౌడ్, కెఎన్ రాములు, గోపాల్ యాదవ్, జనార్దన్ గౌడ్, గోవింద్ చారీ, సయ్యద్, రహీం, యూసుఫ్, శ్రీనివాస్, విక్రమ్, అజార్, లతీఫ్, ఆఫ్సర్, దివ్య, నిరూప, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళ నాయకులు, బీఆర్ ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు , కాలనీ వాసులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here