రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

నమస్తే శేరిలింగంపల్లి : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. జె. శ్రీనివాస్ (40) డ్రైవర్ గా పనిచేస్తున్నాడు, అయితే బుధవారం తన స్కూటీ TS15FD4874పై పని నిమిత్తం గచ్చిబౌలికి వెళ్తున్నాడు. ఉదయం 9 గంటల ప్రాంతంలో నల్లగండ్ల ఫ్లైఓవర్ నుండి గుల్మోహర్ సిగ్నల్ సమీపంలో HDFC బ్యాంక్ వద్ద శుభం రెస్టారెంట్ దగ్గరకు రాగానే.. కర్ణాటక RTC బస్సు నెం. KA38F1133 ఢీ కొట్టడంతో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. కుడి చేతికి బలమైన గాయం కావడంతో, అతడిని అర్చన ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు తెలిపారు. చందానగర్ పోలీసులు KSRTC బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here