రేణుక ఎల్లమ్మ తల్లి దేవస్థానంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రత్యేక పూజలు

నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని హెచ్ సియూ బస్ స్టాప్ వద్ద శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవస్థానంలో చందానగర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కోనేరు యశ్వంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలలో కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డితో కలిసి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ అమ్మ వారి దీవెనలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని వేడుకున్నట్లు తెలిపారు. బోనాల సందర్భంగా ప్రతి గుడి వద్ద అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటు చేశామని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండ అన్ని రకాల వసతులు కల్పించి ప్రశాంత వాతావరణం కలిపించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ గణేష్ ముదిరాజు, చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి ,మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఓ. వెంకటేష్, నాగరాజు, నరేందర్ బల్లా, సికేందర్,దీక్షిత్ రెడ్డి, కొండల్ రెడ్డి, ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here