సకల జనుల అభివృద్ధి.. బిజెపితోనే సాధ్యం: పురంధేశ్వరి

నమస్తే శేరిలింగంపల్లి: సకల జనుల అభివృద్ధి.. బిజెపితోనే సాధ్యమని ఏపీ బిజెపి అధ్యక్షురాలు దగ్గుపాటి అన్నారు. శేరిలింగంపల్లిలో  బిజెపి అభ్యర్థి రవికుమార్ యాదవ్ అధ్వర్యంలో చేపట్టిన రోడ్ షో కు పురంధేశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

శేరిలింగంపల్లిలో  బిజెపి అభ్యర్థి రవికుమార్ యాదవ్ అధ్వర్యంలో చేపట్టిన రోడ్ షో కు ముఖ్య అతిథిగా హాజరై ప్రజలకు అభివందనం చేస్తున్న పురంధేశ్వరి

ఈ ర్యాలీ భారీ జనసందోహం మధ్య సాగింది. ప్రజలు, బిజెపి శ్రేణులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శేరిలింగంపల్లిలో కమలం జెండా ఎగరడం ఖాయమన్నారు. 30న జరిగే ఎన్నికల్లో బిజెపి పార్టీకే ఓటేసి రవికుమార్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

రవికుమార్ యాదవ్ రోడ్ షో లో జన సందోహం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here