అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తాం : బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్

  • కొండాపూర్ డివిజన్ లో కొనసాగిన గడప గడపకు బీజేపీ రవన్న ప్రజాయాత్ర
కొండాపూర్ డివిజన్ లో గడప గడపకు బీజేపీ రవన్న ప్రజాయాత్రలో బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్

నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ లో గడప గడపకు బీజేపీ రవన్న ప్రజాయాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా మస్తాన్ నగర్, గుట్టల బేగం పేట్ లలో కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ, రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని ప్రజలకు తెలియజేస్తూ ఇంటింటికి బిజెపి పార్టీ కరపత్రాలను పంచారు. బీజేపీ శ్రేణులతో కలిసి పర్యటించి అనంతరం బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ మాట్లాడారు. కొండాపూర్ డివిజన్లో గత ప్రభుత్వం హయంలో చేసిన అభివృద్ధి తప్ప ఇప్పుడు జరిగింది ఏమీ లేదని, రోడ్లు, డ్రైనేజీ ఒక్క వానకే అస్తవ్యస్తంగా తయారవుతున్నాయని, అధికారులు ప్రణాళికా రహితంగా నిర్మాణాలు చేపడుతున్నారని , ఎన్నో పనులు శాంక్షన్ అయినా మొదలు పెట్టలేదని తెలిపారు. నాయకులకు , అధికారులకు ఇంత నిర్లక్ష్యం తగదని హితవు పలికారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ప్రతి కాలనీ, ప్రతి బస్తి ప్రణాళికా బద్దంగా అన్ని డివిజన్లలో అభివృద్దే లక్ష్యంగా పని చేస్తామన్నారు. బి.ఆర్.ఎస్ పార్టీ వల్ల ఎమ్మెల్యేలు అవినీతి చేశారని కేసిఆర్ కు తెలిసిన ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జయలక్ష్మి, ఆంజనేయులు సాగర్, చంద్రశేకర్ యాదవ్, ఆంజనేయులు, లక్ష్మణ్, సాయి, డేవిడ్, అజయ్, నాగార్జున, ఎల్లేశ్, నరేష్ , గోపాల్ కృష్ణ, రాజు ,రమేష్, రాజేందర్ , హనుమంత్ నాయక్, నవీన్ రెడ్డి, మేరీ, వినితా సింగ్, పద్మ , రేణుక , సరోజా రెడ్డి , సంతోష రెడ్డి, మధు యాదవ్, నరసింహ, పార్వతి, రామ్ రెడ్డి, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక కాలనీ వాసులు పాల్గొన్నారు.

గడప గడపకు బీజేపీ లో ఓ అవ్వ సమస్య తెలుసుకుంటున్న రవికుమార్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here