పాదయాత్ర కొనసాగిస్తాం.. ప్రజా సమస్యలపై పోరాడుతాం

  • 14 వ రోజు రవన్న ప్రజా యాత్రలో బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్
రవన్న ప్రజా యాత్రలో బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: ఎవరు ఏమన్నా పాదయాత్ర కొనసాగిస్తాం.. ప్రజా సమస్యలపై పోరాడుతామని బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ అన్నారు. ఆల్విన్ కాలనీ డివిజన్ లో నిర్వహించిన గడపగడపకు బిజెపి కార్యక్రమంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు రామరాజు, నరేందర్ రెడ్డి, కమలాకర్ రెడ్డి, రవీందర్ రావు, అరుణ్ కుమార్ నర్సింగ్ యాదవ్, నరసింహ చారి, సీతారామరాజు రఘు, అనిత పాల్గొని ఇంటింటికి తిరిగి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ స్థానిక ప్రజాప్రతినిధులు డివిజన్లో చేసిన అభివృద్ధి గోరంతా అయితే గొప్పలు చెప్పుకోవడంలో కొండంత అన్నట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేసి అడుగడుగునా రాష్ట్ర ప్రభుత్వాన్ని స్థానిక ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తూ ఉంటే వారికి సమాధానం చెప్పే ఓపిక లేక ప్రతిపక్ష పార్టీలపై ఆగ్రహానికి వస్తున్నారని తెలిపారు. ప్రజలకు అండగా నిలుస్తామని హామీ ఇస్తూ పాదయాత్ర కొనసాగించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు శ్రీనివాసులు, ఆంజనేయులు యాదవ్, రాజు, శేఖర్ చాంద్ భాయ్, మనీషా, విష్ణు, సందీప్ గౌడ్, సురేష్, సుధాకర్, పాల్గొన్నారు.

సమస్యల తీరును తెలుసుకుంటున్న రవికుమార్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here