ఘనంగా దవాత్- ఏ – ఇఫ్తార్

నమస్తే శేరిలింగంపల్లి: రంజాన్ మాసం పర్వదినంను పురస్కరించుకుని హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని సాయి నగర్ కాలనీలోని మసీదు లో దవాత్- ఏ – ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొని మాట్లాడారు. దెైవ ప్రార్థనలతో సామరస్యం, శాంతి సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. రంజాన్ పర్వదినం ను పురస్కరించుకుని ముస్లిం సోదరులకు ఇప్తార్ విందు ఇవ్వడం చాలా అభినదించదగ్గ విషయమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి  కెసిఆర్ ముస్లింల అభివృద్ధికి కృషి చేస్తున్నారని , షాదిముబారక్  పథకంతో ద్వారా ప్రతి పేదింటి ముస్లిం ఆడపిల్లకు అండగా నిలబడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అక్తర్, ఎండి. ఇబ్రహీం, శ్రీనివాస్ చౌదరీ, లాల్ మహ్మద్ పటేల్, షేక్ లాల్ పటేల్, అహ్మద్, షరీఫ్, అబ్దుల్ జబ్బార్, మహ్మద్ అజిమ్, హేమంత్, మున్సార్, అజార్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

దవాత్- ఏ – ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులతో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here