ఇప్పటి నాయకులది దోచుకోవడం, దాచుకోవడమే

  • దత్తాత్రేయ కాలనీలో గత ప్రభుత్వాల హాయంలోనే అభివృద్ధి
  • 11 వ రోజు రవన్న ప్రజా యాత్రలో బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్
11 వ రోజు రవన్న ప్రజా యాత్రలో పాదయాత్ర చేస్తున్న బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: ఆల్విన్ కాలనీ డివిజన్ లో గడప గడపకు బిజెపి కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా మహావీర్ నగర్ దత్తాత్రేయ కాలనీలో రావన్న ప్రజా యాత్ర కొనసాగగా .. మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షుడు రామరాజు, నరేందర్ రెడ్డి, కుమార్ యాదవ్, కమలాకర్ రెడ్డి, రవీందర్ రావు, నర్సింగ్ యాదవ్, నరసింహ చారి, అనితతో కలిసి బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ చేపట్టిన పాదయాత్ర గడప గడపకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలలో నాయకులు అభివృద్ధిని కాంక్షించే వారని, ఇప్పుడున్న నాయకులు దోచుకోవడం, దాచుకోవడం, పేదవారిపై దురుసుగా ప్రవర్తించడం అలవాటైపోయిందని తెలిపారు. తెలంగాణలో, నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగరాలని, వెంటనే సమస్యలపై సమర శంఖారావం పూరిస్తామని చెప్తూ పాదయాత్రను ముందుకు తీసుకెళ్లారు. కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా, నియోజకవర్గ మహిళా మోర్చా, యువ మోర్చా, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రజలకు పార్టీ సంక్షేమ కార్యక్రమాల కరపత్రాలను అందజేస్తున్న రవికుమార్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here