రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్ధానాలను వెంటనే నెరవేర్చాలి : బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాగ్ధానాలను వెంటనే నెరవేర్చాలని, లేనిపక్షంలో ప్రజలకు క్షమాపణ కోరుతూ తక్షణమే అధికారం నుండి వైదొలగాలని బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. గడపగడపకు బిజెపి కార్యక్రమంలో భాగంగా కూకట్ పల్లి పాపిరెడ్డి నగర్లో స్థానిక నాయకులతో కలిసి సమస్యలపై పాదయాత్ర నిర్వహించారు.

పాపిరెడ్డి నగర్లో స్థానిక నాయకులతో కలిసి సమస్యలపై పాదయాత్ర చేస్తున్న బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్

ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ ఇదిగో అదిగో అని ఊరిస్తూ ఇప్పటికే 8 ఏళ్లు గడిచిన రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక పూర్తి అయినచోట్ల కూడా ఇండ్లు పంచడం లేదని తెలిపారు. గడప గడపకు బిజెపి కార్యక్రమంలో ప్రజలు చాలా సమస్యలు తమకు చెప్పుకుంటున్నారని, దాంట్లో ప్రధానమైనవి డబల్ బెడ్ రూమ్స్ సమస్య అని చెప్పారు. ఇల్లు ఇస్తామని చెప్పి ఓట్లు వేసుకొని ఇప్పుడు మొహం చాటేసారని శేరిలింగంపల్లి నియోజకవర్గం లో చాలామంది పేదవారేనని, చాలామంది అద్దె ఇంట్లో ఉంటూ కిరాయిలు కట్టలేని స్థితిలో ఉన్నారని తెలిపారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు భూపాల్ రెడ్డి, పర్వతాలు యాదవ్, శ్రీహరి యాదవ్, వెంకటేష్ శ్రీనివాస్ పటేల్, శ్రీధర్ పటేల్, గోపాల్ రావు, గోవర్ధన చారి, రమేష్ యాదవ్, ప్రభాకర్, శ్రీలత, అరుణ, లక్ష్మమ్మ, మణెమ్మ, శైలజ, రాజేందర్, ఉపేందర్, బాలు యాదవ్ , శ్రీకాంత్ యాదవ్, విజయ్ కుమార్, నరేష్, సాయి, కళ్యాణ్ పవన్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here