ప్రజా సమస్యలు తీరాలంటే బిజెపితోనే సాధ్యం

  • 13వ రోజు రవన్న ప్రజా యాత్రలో బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్
బిజెపి శ్రేణులతో కలిసి పాదయాత్ర చేస్తున్న రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: ప్రజల బాధలు పోయి అభివృద్ధి జరగాలంటే అది బిజెపితోనే సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో గడపగడపకు వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ తాము పాదయాత్ర చేసి సమస్యలు గుర్తించి సోషల్ మీడియా, పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా సమస్యలను లేవనెత్తి చెప్తే గాని అధికారులు, నాయకులు పనిచేయడం లేదన్నారు. ఆల్విన్ కాలనీ డివిజన్ మహంకాళి నగర్, చత్రపతి శివాజీ నగర్, ఆశా నగర్ లలో నిర్వహించిన పాదయాత్రలో బిజెపి సీనియర్ నాయకులు రామరాజు, కుమార్ యాదవ్, రవీందర్ రావు, కమలాకర్ రెడ్డి, నర్సింగ్ యాదవ్, నర్సింగ్ రావు, సీతారామరాజు, గోపాల్ రావు, పర్వతాలు యాదవ్, శ్రీహరి , ఆకుల లక్ష్మణ్, శ్రీశైలం కురుమ , మధు, మురళి, బాలు, నరేష్, గణేష్, శ్రీనివాస్ విష్ణువర్ధన్ రెడ్డి, సందీప్ గౌడ్, రాజు, రఘు, అనిత, మునిషా, విమల పాల్గొన్నారు.

బిజెపి శ్రేణులతో కలిసి పాదయాత్ర చేస్తున్న రవికుమార్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here