శేరిలింగంపల్లిలో ఈసారి కాషాయ జెండా ఎగరవేస్తాం

  • బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ ధీమా
  • కేశవ నగర్, గౌల్దొడ్డిలో గడపగడపకు బిజెపి
కార్యక్రమంలో మాట్లాడుతున్న బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్, కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లిలో తప్పనిసరిగా ఈసారి కాషాయ జెండా ఎగరేస్తామని బిజెపి రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. స్థానిక నియోజకవర్గం లో గచ్చిబౌలి డివిజన్ పరిధిలో కేశవ నగర్, గౌల్దొడ్డి ప్రాంతాలలో గడపగడపకు బిజెపి కార్యక్రమాన్ని గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డితో కలిసి శనివారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ బీజేపీ కరపత్రాలను పంపిణీ చేశారు అనంతరం జరిగిన సమావేశంలో రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ తాము శేరిలింగంపల్లిలో చేపట్టిన పాదయాత్ర ద్వారా కాలనీలు, బస్తీలలో పర్యటిస్తుంటే ప్రజాప్రతినిధులు అధికారులకు సమస్యలు గుర్తుకొస్తున్నాయని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బిజెపిని శేరిలింగంపల్లిలో ఈసారి గెలిపించాలని ఈ ప్రాంత ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అంతకు ముందు కేశవ నగర్, గౌల్దొడ్డి, బసవతార నగర్ లో ప్రజలు బిజెపి నాయకులకు ఘనంగా స్వాగతం పలికి బిజెపి నాయకులు రవికుమార్ యాదవ్, గంగాధర్ రెడ్డిని సన్మానించారు. కార్యక్రమంలో కంటెస్టెంట్ కార్పొరేటర్ ఎల్లేష్, రాధాకృష్ణ యాదవ్, తిరుపతి, హనుమంతు, రమేష్, నరసింహ, శ్రీశైలం కురుమ, ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్, గణేష్ ముదిరాజ్, రవి ముదిరాజ్, పద్మ, వరలక్ష్మి ఇందిరా, రేణుక పాల్గొన్నారు.

అవ్వ కు నమస్కరించి సమస్యలు తెలుసుకుంటున్న రవికుమార్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here