కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవండి.. అభివృద్ధికి కృషి చేస్తాం

  • శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు రఘునాథ్ యాదవ్ పిలుపు

నమస్తే శేరిలింగంపల్లి: ప్రజలకు అమలు చేయగలిగే పథకాలు, హామీలనే తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టామని కాంగ్రెస్​ పార్టీ రాష్ట్ర నాయకులు రఘునాథ్ యాదవ్ తెలిపారు. గురువారం హఫీజ్ పేట్ డివిజన్ ప్రేమ్ నగర్ లో ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర నాయకులు రఘునాథ్ యాదవ్ పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాల కరపత్రాన్ని ప్రజలకు అందజేస్తూ..

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ప్రజలకు వివరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన ఆరు గ్యారంటీ పథకాలు సామాన్యులకు అందనున్నాయని చెప్పారు. ఒక్కో వర్గానికి సంబంధించి ఒక్కో ప్రధానాంశాన్ని పార్టీ ఇచ్చే గ్యారంటీల్లో చేర్చడం, అన్ని వర్గాలను ఆకట్టుకునేలా.. మేనిఫెస్టో రూపకల్పన కాంగ్రెస్‌ పార్టీ చేసిందన్నారు.

ప్రజలకు అభివాదం చేస్తున్న రఘునాథ్ యాదవ్

కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతీ కార్యకర్త పార్టీకి అండగా నిలవాలని, రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కష్టపడాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించాలని, ఒక్కసారి అవకాశం ఇస్తే నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు శాంతయ్య, ఉమామహేశ్వరరావు, నరేందర్ గౌడ్, సందీప్ గౌడ్, సుదర్శన్, జమీర్, తాహీర్, హుస్సేన్, మల్లేష్, జమీల్, సంజయ్, వెంకటేష్, దేవేందర్, రషీద్, రహీం, కుమ్మరి, శ్రీశైలం, గిరి మరియు అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here