ప్రచారానికి అపూర్వ స్పందన

  • కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ ని గెలిపించాలని ఆ పార్టీ సీనియర్ నాయకుల ఇంటింటా ప్రచారం
  • మద్దతు తెలిపిన ప్రజలు

నమస్తే శేరిలింగంపల్లి: కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తున్నదని ఆ పార్టీ సీనియర్ నాయకులు తెలిపారు. గోపినగర్ నెహ్రూనగర్ బస్తీలలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కాట నరసింహ గౌడ్, కలివేముల వీరేశం గౌడ్ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. డివిజన్ ప్రెసిడెంట్ జహంగీర్,  నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్ సౌందర్య రాజన్, అక్బర్ వహీదా, ఆసీస్, చారి, పాషా భాయ్, రఫీ తదితర ముఖ్యనాయకులు పాల్గొని ప్రజలకు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ పథకాల కరపత్రాలను అందజేశారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు పార్టీ కరపత్రాలను అందజేస్తున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు

కాంగ్రెస్ పార్టీకి ఓటేసి జగదీష్ అన్నను భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే అది జగదీశ్వర్ గౌడ్ తోటే సాధ్యమని చెప్పారు.

ఎన్నికల ప్రచారంలో..
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here