వర్షాకాలంలో జర భద్రం..

  • అవసరం ఉంటే తప్ప బయటకు రావద్దు
  • ప్రజలకు కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ విజ్ఞప్తి

నమస్తే శేరిలింగంపల్లి: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని.. అవసరాన్ని బట్టి తగిన జాగ్రత్తలు తీసుకొని బయటకు రావాలని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హాఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని జనప్రియ అపార్ట్ మెంట్ నందు లోతట్టు ప్రాంతాల్లో అధ్యక్షులు ప్రవీణ్ గౌడ్, జీహెచ్ఎంసి సిబ్బంది, వాటర్ వర్క్స్ అధికారులతో కలిసి పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. హాఫీజ్ పెట్/మాదాపూర్ డివిజన్ పరిధిలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here