రోడ్లు, డ్రైనేజి, తాగు నీటి సమస్యల పరిష్కారానికి కృషి : కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్

నమస్తే శేరిలింగంపాలి: నిత్యం అందుబాటులో ఉంటూ రోడ్లు, డ్రైనేజి, తాగు నీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రగతి ఎనక్లేవ్ కాలనీలోని ఆర్ వి అవెనెంద్ర అపార్ట్ మెంట్స్ లో తలెత్తిన డ్రైనేజీ సమస్యను అసోషియన్ సభ్యులతో కలసి పరిశీలించారు.

ఆర్ వి అవెనెంద్ర అపార్ట్ మెంట్స్ లో తలెత్తిన డ్రైనేజీ సమస్యను పరిశీలిస్తున్న కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్
ఆర్ వి అవెనెంద్ర అపార్ట్ మెంట్స్ లో పర్యటిస్తున్న ఉప్పలపాటి శ్రీకాంత్

అనంతరం ఉప్పలపాటి శ్రీకాంత్ మాట్లాడుతూ, ఆర్ వి అవెనెంద్ర అపార్ట్ మెంట్స్ విజ్ఞప్తి మేరకు డ్రైనేజీ సమస్యను పరిశీలించామని, అవెనెంద్ర అపార్ట్ మెంట్స్ అసోషియన్ పరిధిలో మౌళిక వసతులు కల్పించడమే ప్రధాన ద్యేయంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. పూర్షోత్తమ్ యాదవ్, శివకోటి, కళ్యాణ్, ప్రసాద్, చంద్ర శేకర్ స్వామి పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here