కాలనీలో సమస్యలు పరిష్కరించండి

  • ప్రభుత్వ విప్ గాంధీని కలిసి వేడుకున్న బంజారా నగర్ బస్తీ వాసులు
ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీకి పులా బొకే ఇస్తున్న బంజారా నగర్ బస్తీ వాసులు

నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ పరిధిలోని బంజారా నగర్ బస్తీ వాసులు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కాలనీ లో నెలకొన్న పలు సమస్యలు, చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనుల పై వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బంజారా నగర్ కాలనీ వాసులు మాట్లాడుతూ కాలనీ లో అసంపూర్తిగా మిగిలిపోయిన సీసీ రోడ్లు ను పూర్తి చేయాలని , విధి దీపాలను ఏర్పాటుతో పాటు మౌలిక వసతులు కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ కాలనీలో అసంపూర్తిగా మిగిలిపోయిన సీసీ రోడ్ల ను త్వరలోనే వెయిస్తామని, కాలనీలో నెలకొన్న సీసీ రోడ్లు, డ్రైనేజి, వీధి దీపాల వంటి సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని , కాలనీలలో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని, హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బంజారా నగర్ వాసులు రవి శంకర్, సుదర్శన్, చిట్టి బాబు, పరుషరాము , రాజు, నర్సింహ,శంకర్, సాయిలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here