- మాజీ సీఎల్పీ నేత దివంగత జనార్ధన్రెడ్డి కి నివాళి అర్పించిన జగదీశ్వర్ గౌడ్
నమస్తే శేరిలింగంపల్లి : మాజీ సీఎల్పీ లీడర్ దివంగత పి.జనార్దన్ రెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని హాఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని గంగారాం, లింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీ, హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని జె.ఎన్.టి.యూ బస్ స్టాప్, అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పీజేఆర్ నగర్, కూకట్పల్లి డివిజన్ పరిధిలోని హనుమాన్ నగర్, వివేకానంద నగర్ వెంకటేశ్వర నగర్, ఆర్.పి కాలనీ వద్ద పీజేఆర్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ సీనియర్ నాయకులు జేరిపేటి జైపాల్ తో కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పీజేఆర్తో తమకున్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. తాను రాజకీయంగా ఎదగడానికి పీజేఆర్ ముఖ్యపాత్ర పోషించారని, తెలంగాణ కోసం ముఖ్యంగా అప్పటి ఖైరతాబాద్ నియోజకవర్గంలో భాగమైన శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని గుర్తుచేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సునీత రెడ్డి, శేరిలింగంపల్లి నియోజకవర్గ నాయకులు కృష్ణ ముదిరాజ్, కూన సత్యం గౌడ్, గఫుర్, వీరేందర్ గౌడ్, నడిమిట్టి కృష్ణ, విక్రమ్, సాంబశివరావు, సంగారెడ్డి, వీరేశం గౌడ్, ప్రతాప్ రెడ్డి, కావూరి ప్రసాద్, విజయభాస్కర్ రెడ్డి, జనార్దన్ గౌడ్, సుదర్శన్, లింగంపల్లి డివిజన్ అధ్యక్షులు జహంగీర్, వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షులు బాష్పక నాగమణి యాదగిరి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు సురేష్ నాయక్, అల్విన్ కాలనీ డివిజన్ అధ్యక్షులు మరేళ్ల శ్రీనివాస్, సాదిక్, శ్రీకాంత్, శ్రీను, లక్ష్మణ్, సుధాకర్, కృష్ణ, దేవరాజ్, రాజు, విష్ణు, గౌస్, హనీఫ్, రషీద్, జావిద, పద్మారావు, వెంకట్ రెడ్డి, కార్తిక్ గౌడ్, తిరుపతి, శివ కుమార్, రమేష్, అలీ, కుమార్, శ్రీను, అశోక్, సురేష్, నవీన్ ముదిరాజ్, వెంకటేష్, శ్రీకాంత్, రాజమల్లు, స్వామి ముదిరాజ్, సంతోష్ చౌదరి, శ్రీనివాస్ యాదవ్, రవి కుమార్, రాంబాబు, వెంకటస్వామి సాగర్, యాకయ్య, వెంకటేష్, పి.రామారావు, మల్లేష్, గోపాల్, ప్రభాకర్, శివ, ఉదయ్ రావు, పరుశురాం, ముత్తయ్య, కన్నా రావు, ఎలా రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఆంజనేయులు, యూసుఫ్, రాములు, వీర రెడ్డి, రాజు, శశిధర్, మోహన్ రావు, వెంకట్, శివ, మేకల సుదర్శన్, ఏ.రాజు, శశిధర్, వెంకటయ్య, రవికుమార్, శేఖర్, ఒర్సు రవి, సంగమేష్, రాజా, రామకృష్ణ, రెహమాన్, శివ, రమేష్, రవి కుమార్, రఫిక్, శ్రీనివాస్, బాలు, గుజ్జుల శ్రీనివాస్ రెడ్డి, దొడ్లరామ్ రెడ్డి, శరత్ రెడ్డి, వీరేశం, యాదగిరి మేస్త్రి, మహిళలు పార్వతి, రాణి, శాంతి, తన్విర్, అరుణ, మనెమ్మ, అమ్ములు, విజయమ్మ, సుజాత, రజిని, సావిత్రమ్మ, ప్రభావతి, సులోచన, కుమారి పాల్గొన్నారు.





