ప్రతి ఒక్కరు విధిగా వ్యాయామం చేయాలి

  • ఓపెన్ జిమ్ ప్రారంబోత్సవంలో ప్రభుత్వ విప్ గాంధీ
జనప్రియ వెస్ట్ సిటీ కాలనీలో ఓపెన్ జిమ్ ప్రారంభించిన ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని జనప్రియ వెస్ట్ సిటీ కాలనీలో రూ.18 లక్షల అంచనావ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ జనప్రియ వెస్ట్ కాలనీలో ఓపెన్ జిమ్ ను ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు. ప్రస్తుత జీవన విధానంలో ప్రతి ఒక్కరూ విధిగా వ్యాయామం చేయటం ఎంతో అవసరమని, ఆరోగ్యం బాగుంటే మనిషి ఏదైనా సాధించగలడని, ఆరోగ్యమే మహా భాగ్యమన్నారు. ఈ కార్యక్రమంలో జనప్రియ వెస్ట్ కాలనీ అధ్యక్షుడు సత్యనారాయణ, సెక్రటరీ గోవర్ధన్, సోమిరెడ్డి, ఇమ్మానుయేల్, భాస్కర్ రావు, ఇన్నారెడ్డి, మల్లికార్జున్, ప్రదీప్, రామలింగం, రామకృష్ణ, నర్సింలు, కాలనీ సభ్యులు పాల్గొన్నారు.

ఓపెన్ జిమ్ లో ఏర్పాటు చేసిన పరికరాలను పరిశీలిస్తున్న గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here