వడ్డెరలను ఎస్టి జాబితాలో చేర్చేందుకు కలిసికట్టుగా పోరాడుతాం

నమస్తే శేరిలింగంపల్లి: అఖిలభారత జాతీయ రాష్ట్ర వడ్డెర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి అధ్యక్షుడు ముద్దంగుల తిరుపతి, జాతీయ ప్రచార కార్యదర్శి మంజల మారయ్య ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి 106 డివిజన్ పాపి రెడ్డి నగర్ కాలనీలో నూతన కార్యవర్గ కమిటీలను ఎన్నుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సలహాదారులుగా ఇరగట్టి ఎల్లప్ప, 106 డివిజన్ అధ్యక్షుడిగా సంపంగి రాజు, ఉపాధ్యక్షుడిగా రేపన్ కళ్యాణ్ బాబు, 106 డివిజన్ యూత్ అధ్యక్షుడిగా ఆలకుంట్ల రాజును ఎన్నుకున్నారు.

నియామక పత్రాలు అందుకుంటున్న నూతన కార్యవర్గ కమిటీ సభ్యులు

జాతీయ రాష్ట్ర నాయకుల పిలుపుమేరకు వడ్డెరలను ఎస్టి జాబితాలో చేర్చేందుకు అందరం కలిసికట్టుగా పోరాడుతామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ అధ్యక్షుడు వేముల లక్ష్మణ్, జాతీయ ప్రధాన కార్యదర్శి గుంజ శ్రీనివాస్, జాతీయ మహిళ అధ్యక్షురాలు వేముల తిరుమల దేవి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎత్తరి మారయ్య, సభాధ్యక్షుడు మంజుల అన్నమయ్య, తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ అధ్యక్షుడు సాతల గోపాల్, తెలంగాణ రాష్ట్ర యూత్ ఉపాధ్యక్షుడు వెంకటేష్, వడ్డెర సంక్షేమ సంఘం సభ్యులు రామకృష్ణ, గిరి, రామస్వామి, తిమ్మయ్య , హనుమయ్య, ఎల్లప్ప, మారయ్య మహిళలు ఇతరులు పాల్గొన్నారు.

నూతన కార్యవర్గ కమిటీ సభ్యులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here