బాధిత గుడిసెవాసులకు నిత్యావసరాలు పంపిణి

బాధిత గుడిసెవాసులకు నిత్యావసరాలు పంపిణి చేస్తున్న అఖిలభారత వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎత్తరి మారయ్య, శేరిలింగంపల్లి అధ్యక్షుడు ముద్దంగుల తిరుపతి

నమస్తే శేరిలింగంపల్లి: మూడు రోజుల కిందట శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్ ప్రాంతంలోని స్టాలిన్ నగర్ లో వడ్డెర సంగం కులస్తుల గుడిసెలను కూల్చిన విషయం విదితమే. ఈ విషయంపై అఖిలభారత వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎత్తరి మారయ్య, శేరిలింగంపల్లి అధ్యక్షుడు ముద్దంగుల తిరుపతి స్పందించి వారిని పరామర్శించారు. గుడిసెవాసులకు నిత్యావసర సరుకులు అందించారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. అతి త్వరలో స్థానిక ఎమ్మెల్యే , కార్పొరేటర్ల, అధికారుల దృష్టికి తీసుకెళ్తామని, న్యాయం చేకూరేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక వడ్డెర సంఘం నాయకులు పూజారి గురువయ్య, గిరయ్య, మల్లేష్, రామకృష్ణ, గురువయ్య, హనుమంతు పాల్గొన్నారు.

నిత్యావసరాల పంపిణి అనంతరం గుడిసెవాసులతో అఖిలభారత వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎత్తరి మారయ్య, శేరిలింగంపల్లి అధ్యక్షుడు ముద్దంగుల తిరుపతి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here