శేరిలింగంపల్లి, మార్చి 13 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని భవానీపురం వీకర్ సెక్షన్ బస్తీలో ఉన్న మజీద్ ఏ గౌసియా మజీద్, వేముకుంట బస్తీలో ఉన్న మొహమ్మదీయా మజీద్ లో బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్, మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మొయినుద్దీన్, అల్తాఫ్, అఖిల్, శబనా, బాబా, ప్రకాష్, గౌస్, ప్రమోద్, అంజి, శేఖర్, మల్లేష్ యాదవ్, ఉపేందర్, బాల కృష్ణ యాదవ్, అనంత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






