నేతాజీ నగర్ కాలనీలో అంగన్ వాడీ సెంటర్ లో పల్స్ పోలియో

  • చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి గచ్చిబౌలి డివిజన్ నేతాజీనగర్ కాలనీలోని అంగన్ వాడి సెంటర్ లో పల్స్ పోలీయో కార్యక్రమం నిర్వహించారు.

చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్న బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్

ఈ కార్యక్రమంలో నేతాజీ నగర్ కాలనీ అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ భారతదేశం పోలియో రహిత దేశమని అన్నారు. పిల్లలకు కచ్చితంగా పోలియో చుక్కలు వేయించాలని, పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు అవి దోహదపడతాయని పేర్కొన్నారు. అంగన్ వాడీ టీచర్ మనీలా, ప్రభుత్వ ఆసుపత్రి ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here