పరిరాలను పరిశుభ్రంగా ఉంచాలి

  • నేతాజీ నగర్ కాలనీలో స్వచ్ఛభారత్ నిర్వహించిన కాలనీ అధ్యక్షులు భేరి రామచందర్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి గచ్చిబౌలి డివిజన్ నేతాజీ నగర్ కాలనీలో కాలనీ అధ్యక్షులు భేరి రామచందర్ యాదవ్ జిహెచ్ఎంసి సిబ్బందితో కలిసి కాలనీలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలనీలో చౌరస్తాలో నిల్వ ఉన్న చెత్తను ఊడ్చేసి చెత్తను తరలించారు.

నేతాజీ నగర్ కాలనీలో నిర్వహించిన స్వచ్ఛభారత్ లో కాలనీ అధ్యక్షులు భేరి రామచందర్ యాదవ్

కాలనీలోని ప్రజలు తమ ఇంటి పరిసరాలలో ఉన్న చెత్తాచెదారాన్ని శుభ్రం చేసుకోవాలని, లేకుంటే దోమలు, ఈగలు వృద్ధి చెంది ప్రజలు అనారోగ్యాల పాలవుతారని జీహెచ్ఎంసీ సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కే నరసింహ యాదవ్, టి. కుమార్ ముదిరాజ్, గోపాల్ యాదవ్, నాగరాజు, నగేష్ , శంకర్ నాయక్, పుష్ప రెడ్డి, సత్తెమ్మ, కాలనీ యువకులు మహిళలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here