జవహర్ కాలనీ త్రాగు నీటి సమస్యను పరిష్కరించండి: బొబ్బ నవత రెడ్డి

చందానగర్ డివిజన్ పరిధిలోని జవహర్ కాలనీ రోడ్ నెం.4 లో త్రాగు నీటి సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని కార్పొరేటర్ నవతరెడ్డి అధికారులను కోరారు. శుక్రవారం త్రాగు నీటి పైప్ లైన్ పనులను జలమండలి మేనేజర్ సుబ్రమణ్యం రాజు గారు మరియు కాలనీ వాసులతో కలిసి కాలనీ లో పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భం గా కార్పొరేటర్ మాట్లాడుతూ 30 సంవత్సరాల క్రితం వేసిన పాత పైప్ లైన్లు లీకేజీ అవటం వలన, కొత్త పైప్ లైన్ వేయటం జరుగుతుందని,కొత్త పైప్ లైన్ పనులు త్వరగా పూర్తి చేసి కాలనీ వాసులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి,రమేష్,సుబ్బా రావు,వర్క్ ఇన్స్పెక్టర్ రహీమ్ తదితరులు పాల్గొన్నారు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here