లింగంపల్లి విలేజ్‌లో పోచమ్మ, భూలక్ష్మీ అమ్మవార్ల ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవం

శేరిలింగంపల్లి, ఆగ‌స్టు 21 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి విలేజ్‌లో శ్రీ శ్రీ శ్రీ పోచమ్మ, భూలక్ష్మీ అమ్మవార్ల నూతన దేవాలయ విగ్రహాలు, ధ్వజస్తంభ జీర్ణోద్ధరణ అనంతరం పునఃప్రతిష్ఠ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డిలతో కలిసి ఆరెకపూడి గాంధీ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పునఃప్రతిష్ఠ మహోత్సవానికి హాజరైన నాయకులు, భక్తులు, గ్రామస్థులు అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో నాయకులు రఘునందన్ రెడ్డి, సంజీవ రెడ్డి, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బాలింగ్ గౌతమ్ గౌడ్, నాగరాజు, పబ్బా మల్లేష్, ఓ. వెంకటేష్, రవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here