అసంపూర్తిగా మిగిలిన నాల విస్తరణ పనులను వెంటనే పూర్తి చేయాలి : ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: అసంపూర్తిగా మిగిలిపోయిన నాల విస్తరణ పనులను వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తిశ్రీ నగర్ కాలనీలో నాల విస్తరణ లో భాగంగా సత్యనారాయణ ఎనక్లేవ్ వద్ద రూ. 90 లక్షల రూపాయల అంచనా వ్యయం తో చేపడుతున్న నాల విస్తరణ పనులను జిహెచ్ ఎంసీ ఇంజనీరింగ్ విభాగం, టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ రాబోయే వర్షకాలంను దృష్టిలో పెట్టుకొని నాలాల విస్తరణ పనులను వేగవంతం చేయాలని పేర్కొన్నారు. అభివృద్ధి విషయంలో ఎక్కడ రాజీ పడకుండా పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా చేస్తున్నామన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని లోతట్టు ప్రాంతాలు, నీరు నిల్వ ప్రాంతాలను గుర్తించి ప్రజలకు ఇబ్బంది కల్గకుండా సన్నద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిహెచ్ ఎంసీ ఏ ఈ శివప్రసాద్, టిపిఎస్ మౌనిక, వర్క్ ఇన్స్పెక్టర్ రఘు, చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ ఎస్ పార్టీ నాయకులు సీతారామయ్య, వెంకట్, సందీప్ రెడ్డి, లోకేష్ పాల్గొన్నారు.

దీప్తి శ్రీ నగర్ లో నాల విస్తరణ పనులను పనులను పరిశీలిస్తున్న ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here