నడిగడ్డ తాండావాసుల సమస్యలు పరిష్కరిస్తా : బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్

  • తన సొంత నిధులతో బోర్ వేయిస్తానని హామీ
నడిగడ్డ తాండలో పర్యటిస్తున్న బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: కాలనీవాసుల సమస్యలు శాశ్వతంగా పరిష్కరించేలా కృషి చేస్తానని బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ అన్నారు. మియాపూర్ డివిజన్, నడిగడ్డ తాండవాసుల విజ్ఞప్తి మేరకు ఆ కాలనీలలో పర్యటించగా.. మియాపూర్ డివిజన్, నడిగడ్డ తాండాలలోకి సి.ఆర్.పి.ఎఫ్ ఎలాంటి మెటీరియల్ ను అనుమతించట్లేదని, బోర్, డ్రైనేజీ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని ఈ సందర్భంగా పలు సమస్యలను రవికుమార్ యాదవ్ దృష్టికి తీసుకువచ్చారు కాలనీవాసులు. దీంతో ఆయన స్థానిక సి.ఆర్.పి.ఎఫ్ క్యాంప్ అధికారితో మాట్లాడి కాలనీలో సమస్యల గురించి చర్చించి కాలనీలో అభివృద్ధి ఆగిపోకుండా చూడాలని కోరారు. కాలనీలో సమస్య గురించి కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్తానని, పరిష్కారం అయ్యేవరకు పోరాడతానని కాలనీ వారికి భరోసా ఇచ్చారు. అంతేకాక బోర్ సమస్యను సొంత నిధులతో వేయిస్తానని, మిగతా సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారం దిశగా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో నడిగడ్డ తాండ అధ్యక్షుడు తిరుపతి నాయక్, రెడ్యా నాయక్, దేవునూరి చందు, సీతారాం నాయక్, ఆకుల లక్ష్మణ్, రామకృష్ణ, గణేష్ ముదిరాజ్, వెంకట్ మరియు తాండావాసులు పాల్గొన్నారు.

తాండాలో నెలకొన్న సమస్యలను రవి కుమార్ యాదవ్ కు తెలియజేస్తున్న దృశ్యం

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here