ముస్లింలకు బట్టలు పంపిణి

నమస్తే శేరిలింగంపల్లి: రంజాన్ మాసం పర్వదినంను పురస్కరించుకుని గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని దర్గాలో ముస్లిం సోదర, సోదరీమణులకు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ బట్టలను పంపిణి చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ రంజాన్ మాసం ఉపవాసం తో మంచి తనం, సంస్కారం అలవడుతుందని , మతసామరస్యానికి ప్రతీక అని పేర్కొన్నారు. ముస్లిం ప్రజానీకానికి ముఖ్యమంత్రి  కెసిఆర్ అండగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ ఎస్ పార్టీ నాయకులు దారుగుపల్లి నరేష్, అక్బర్ బాయి ఎండి. ఇబ్రహీం, సల్లావుద్దీన్, కుతుబ్, అంజద్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని దర్గాలో ముస్లిం సోదర, సోదరీమణులకు బట్టలు పంపిణి చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
  • మాదాపూర్ డివిజన్ ఆదిత్య నగర్ మసీదులో..

మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ మసీదులో ముస్లిం సోదర, సోదరీమణులకు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ బట్టలు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్ ఎస్ పార్టీ నాయకులు ఎండి .ఇబ్రహీం, బాబు మియా, ఖాసీం, సలీం, లియకత్, అబ్దుల్ రహీం, మియన్ పటేల్, యూత్ అధ్యక్షులు ఖాజా, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మాదాపూర్ డివిజన్ ఆదిత్య నగర్ మసీదులో బట్టల పంపిణి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here