ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

  • ఎం. సందయ్య మెమోరియల్ ట్రస్టు చైర్మన్ భిక్షపతి యాదవ్
  • 6వ రోజు కొనసాగిన ఉచిత కంటి పరీక్షలు

నమస్తే శేరిలింగంపల్లి: నిత్యం నియోజకవర్గంలో ఎం. సందయ్య మెమోరియల్ ట్రస్టు సేవలు కొనసాగుతుంటాయని, ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఆ ట్రస్ట్ చైర్మన్ భిక్షపతి యాదవ్, సెక్రటరీ రవి కుమార్ యాదవ్ అన్నారు. లింగంపల్లి డివిజన్ గోపి నగర్, బాపూనగర్, నెహ్రూ నగర్, బస్తీ వాసుల సౌలభ్యం కోసం పోచమ్మ టెంపుల్ వద్ద సందయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహించారు.

ఈ శిబిరంలో దాదాపు 500 మందికి కంటి అద్దాలను పంపింణి మాట్లాడారు. ప్రతి మనిషి తన స్థాయికి తగ్గట్టుగా సామాజిక సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎల్లేష్, చంద్రమోహన్, సూరి, ప్రసాద్, విష్ణువర్ధన్ రెడ్డి ఝాన్సీ, నరసింహ, వినయ్, అశోక్, హరీష్, సుశీల లక్ష్మి పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here