సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతాం

  • శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ కాలనీలో నెలకొన్న సమస్యలపై స్థానిక ప్రజలతో కలిసి శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వి.జగదీశ్వర గౌడ్ పాదయాత్ర నిర్వహించారు. అనంతరం కాలనీలో ఉన్న సమస్యలను పరిశీలించారు.

ప్రశాంత్ నగర్ కాలనీకి పాదయాత్రగా వెళ్తూ…

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పక్క ప్రణాళికతో గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తుందని, శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ప్రతి గడపకు వెళ్ళి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారం చూపుతామని, నియోజకవర్గ పరిధిలోని ప్రతి కాలనీ/బస్తీలో అభివృధి పనులను సంబంధిత అధికారులతో త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేల అహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు

ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వి.జగదీశ్వర గౌడ్

ఈ కార్యక్రమంలో నాయకులు ఇలియస్ షరీఫ్, వీరేందర్ గౌడ్, నల్ల సంజీవ రెడ్డి, రఘునందన్ రెడ్డి, బాలింగ్ యాదగిరి గౌడ్, కృష్ణ ముదిరాజ్, ప్రభాకర్ రెడ్డి, సాంబశివరావు, సయ్యద్ తహెర్ హుస్సేన్, సుదర్శన్, సంగారెడ్డి, అశోక్, మురళి, కృష్ణ మూర్తి, కొఠారి వెంకట్, రవి, అసిఫ్, నరేందర్ ముదిరాజ్ మహిళలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here