ప్రజలు, కార్యకర్తల నుండి పుట్టిన పార్టీ బీఆర్ఎస్ 

  • మార్తాండ్ నగర్ లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో ప్రభుత్వ విప్ గాంధీ 

నమస్తే శేరిలింగంపల్లి: ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలే బిఆర్ ఎస్ పార్టీకి శ్రీరామరక్ష అని ప్రభుత్వ విప్ గాంధీ, కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ అన్నారు. కార్యకర్తలే తమ బలం, ప్రజలే బలగమని పేర్కొన్నారు.  కొండాపూర్ డివిజన్ మార్తాండ్ నగర్ లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ కలిసి ప్రభుత్వ విప్ గాంధీ పాల్గొని పూజలు చేశారు.

అనంతరం గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కృష్ణ, పలువురు యువ నాయకులు పార్టీలో చేరారు. ఈ సందర్బంగా గాంధీ మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ ప్రజలు, కార్యకర్తల నుండి పుట్టిన పార్టీ అన్నారు. బలమైన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే తమ గుండె ధైర్యమన్నారు.

ఈ కార్యక్రమంలో కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్, మాజీ కార్పొరేటర్ నీలం రవీందర్ ముదిరాజ్, యువ నాయకులు ఆదిల్ పటేల్, సీనియర్ నాయకులు కృష్ణ, పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here